నర్సింహులపేట: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని తయారు చేసిన పెద్ద నాగారం పాఠశాల విద్యార్థులు
పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో పెద్ద నాగారం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వయంగా మట్టి గణపతిని తయారు చేశారు. రసాయన రంగుల వల్ల కలిగే కాలుష్యం గురించి వివరిస్తూ, అందరూ మట్టి గణపతులనే పూజించాలని కోరారు.