రాప్తాడు: కురుగుంట వీఆర్వో రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి అనంతపురంలో రాప్తాడు దళిత సంఘం నేతులు నిరసన
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో కురుగుంట వీఆర్వో రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాప్తాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బీసీఆర్ దాస్ మాట్లాడుతూ కురుగుంటలో ఎమ్మార్పీఎస్ ఏర్పాటుచేసిన మందకృష్ణ మాదిగ బోర్డ్ తొలగించిన రామకృష్ణ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దళితులకు ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రాప్తాడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులంతా పాల్గొన్నారు.