కనిగిరి: విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తుంది: కనిగిరిలో ఏఐఎస్ఎఫ్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్
కనిగిరి: విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్ ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనిగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణం చెల్లించాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.