కనిగిరి పట్టణంలో ఆర్టీసీ డిపో గ్యారేజ్ లను ప్రైవేటుపరం చేయడానికి నివసిస్తూ ఆర్టీసీ గ్యారేజీ ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఆర్టీసీ డిపో గ్యారేజ్ లను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డిపోలకే కేటాయించాలన్నారు. ఆర్టీసీ డిపో గ్యారేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ప్రభుత్వం పై ఉందని, ప్రైవేట్ పదం చేయాలన్న ఆలోచన సరికాదన్నారు.