కనిగిరి: సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థి తౌషిక్ కుటుంబ సభ్యులను కనిగిరిలో వైసిపి కనిగిరి నియోజకవర్గ YCP ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతిపై విచారణ వేగవంతం చేయాలని అన్నారు. తౌషిక్ తండ్రి ఆలీని వివరాలు అడిగి తెలుసుకుని, విచారణ అధికారి CI ఖాజావళితో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి అనుమానాస్పద మృతి పై విచారణ వేగవంతం చేయాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.