కనిగిరి: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని పాతూరు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరిలోని పాతూరు ఎస్సీ కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.