కనిగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి: కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ
కనిగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జూనియర్ సివిల్ జడ్జి బి రూప శ్రీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జీ రూప శ్రీ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా సకాలంలో వర్షాలు కురిసేలా దోహదం చేస్తుందన్నారు. వాతావరణ సమతుల్యం తోపాటు, వాతావరణ కాలుష్యాన్ని కొంతమేర తగ్గించవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.