ఉరవకొండ: జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమంతో
చిన్నారులకు బోధనలో నాణ్యత పెంచడానికే శిక్షణ:సిడిపిఓ డాక్టర్ శ్రీదేవి
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని స్థానిక ఎం ఆర్ సి కార్యాలయం నందు బుధవారం జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సిడిపిఓ డాక్టర్ బి.ఎన్ శ్రీదేవి పాల్గొనగా సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో చిన్నారులకు బోధనలో నాణ్యత పెంచడానికి శిక్షణ నిర్వహిస్తున్నామని, పిల్లలలో జరిగే వివిధ రకాల అభివృద్ధి, ఏ విధంగా అంగన్వాడి బోధన చేయాలని, ఆటపాటలతో విద్యను ఏ విధంగా నేర్పించాలని వివిధ విషయాల గురించి అంగన్వాడి కార్యకర్తలకు తెలిపారు, కేంద్రాలలో చిన్నారుల యొక్క అభివృద్ధిలను మెరుగుపరచాలన్నారు.