వజ్రకరూరు మండలం జె.రాంపురం గ్రామంలో జరుట్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగునున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జిల్లా సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాశివరాత్రికి పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని స్థానిక ఈవోను ఆదేశించారు.