వజ్రకరూరు మండలం కడమలకుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈఓ తిమ్మప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో పరిశీలించారు. విద్యార్థుల కు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలితమ్మ, శివ పాల్గొన్నారు.