ఉరవకొండ: రాగులపాడు వద్ద రోడ్డు ప్రమాదం, కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ, వైసీపీ నాయకుడు మృతి
వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఉరవకొండకు చెందిన వైసీపీ నాయకుడు జంగ్లీ నగేష్ మృతి చెందాడు. ఉరవకొండ నుంచి జంగ్లీ నగేష్ తన భార్యతో కలిసి డోన్ లో జరుగుతున్న వివాహానికి బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో టైర్ పగిలింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనింది. ప్రమాదంలో జంగ్లీ నగేష్ స్పాట్లోనే మృతి చెందాడు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.