రాప్తాడు: రామగిరి పాఠశాలలోనూ పేరూరు ఉన్నత పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాప్తాడుఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు ఉన్నత పాఠశాలలో శనివారం 8 గంటల 15 నిమిషాల సమయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రామగిరి పేరూరు పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆనందంగా ఉందని మన దేశ స్వతంత్రం కోసం ఎందరో పోరాటాలు చేసి ఉంటేనే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఇలాంటి సందర్భంలో దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరు విద్యార్థులు గుర్తుంచుకోవాలని వారి చరిత్రను తెలుసుకోవాలని పరిటాల సునీత పేర్కొన్నారు.