రాప్తాడు: భైరవనగర్లో ఐద్వా నగర కార్యదర్శి అశ్విని ఆధ్వర్యంలో ఆగస్టు 15 సందర్భంగా జాతీయ పతాక ర్యాలీని నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని భైరవ నగర్ కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో ఆగస్టు 15 పురస్కరించుకొని ఐద్వా నగర కార్యదర్శి అశ్విని ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థినిలతో జాతీయ పతాక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నగర కార్యదర్శి అశ్విని మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశం కోసం స్వతంత్రం తీసుకురావడంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని వారి త్యాగాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించి స్వసంత్రం గురించి వివరించామని అనంతపురం ఐదవ నగర కార్యదర్శి అశ్విని పేర్కొన్నారు.