కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఉచిత వెరికోసిస్ వైద్య శిబిరం, బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ
కనిగిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత వెరికోసిస్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాళ్లలో నరాల వాపు, తీవ్రమైన నొప్పితో బాధపడే వెరికోసిస్ వీన్స్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో పాల్గొన్న ప్రముఖ నిపుణులైన వైద్యులు బాధితులకు అధునాతన పరికరాలతో పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... మారుతున్న జీవనశైలి, గంటల తరబడి నిలబడి పనిచేయడం వల్ల వెరికోసిస్ సమస్య ఎక్కువగా వస్తుందని, ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే శస్త్రచికిత్స లేకుండా నయం చేయవచ్చని తెలిపారు