సంతనూతలపాడు: చిలకపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు ప్రారంభమైన జీవనజ్యోతి పై 3రోజుల శిక్షణా తరగతులు
సంతనూతలపాడు మండలం చిలకపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు జీవనజ్యోతి కార్యక్రమం పై శిక్షణ మంగళవారం ప్రారంభమైంది .మూడు రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగున్నాయి. మొదటిరోజు శిక్షణ కార్యక్రమానికి ఎంఈఓ డి వెంకా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఎలా విద్యా బోధన చేయాలి, వారికి పౌష్టికాహారం ఏ విధంగా అందించాలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని చిన్నారులకు, గర్భవతులు, బాలింతలకు క్రమం తప్పకుండా అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించార