సంతనూతలపాడు మండలంలోని మంగమూరులో సచివాలయ సిబ్బంది చేపడుతున్న ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సంతనూతలపాడు డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని తప్పులు లేకుండా సచివాలయ సిబ్బంది నమోదు చేయాలన్నారు. భవిష్యత్తులో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వ పథకాలను పొందేందుకు లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందన్నారు. నూరు శాతం సర్వే ను పూర్తి చేయాలన్నారు.