చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నూతన మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుందని చీమకుర్తి ఎక్సైజ్ సీఐ సుకన్య గురువారం తెలిపారు. ఆసక్తి కలవారు ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 2 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె అన్నారు. ఒక్కొక్క మద్యం షాపుకు ప్రభుత్వం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దరఖాస్తు తో పాటు తప్పనిసరిగా ఫీజు ను చెల్లించాలన్నారు.