చీమకుర్తి మండలం లోని కొన గాని వారి పాలెం లో ఎంపీడీవో సురేష్ బాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీవో పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్లు నిత్యం ఇళ్ల నుండి చెత్త సేకరణ జరిగేలా చూడాలని ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. చెత్త నుండి సంపదను సృష్టించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఎంపీడీవో సూచించారు.