చీమకుర్తి పట్టణంలోని ఈస్ట్ బైపాస్ జంక్షన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోటర్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న కోటయ్య రాజేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చీమకుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ తిరుపతయ్య అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.