ఉరవకొండ: పట్టణంలో వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ
ఉరవకొండ నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే, పీ ఏ సి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం DSC–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండ భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయతీ ఆఫీస్ నుంచి తహసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ జరిగింది.ఈ ర్యాలీలో జిల్లా అధికారి వీరన్న పార్టీ నాయకులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని DSC అక్రమాలపై నిరసన వ్యక్తం చేశారు.