ఖైరతాబాద్: బ్రాహ్మణులు సంఘటితంగా ఉండాలి : శ్రీనగర్ కాలనీలో మంత్రి శ్రీధర్ బాబు
శ్రీనగర్ కాలనీలో బ్రాహ్మణ సేవా సమాఖ్య నిర్వహించిన కార్తీక వనసమారాధనలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ బ్రాహ్మణులకు మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని వారు అన్నారు. బ్రాహ్మణులు సంఘటితంగా ఉండాలని, ఏసమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గొప్ప సేవాతత్వం కలవారని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారిని కోరారు.