నిరుపేదల వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తామని ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం సీతాఫల్మండి క్యాంప్ ఆఫీస్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. 20 మంది లబ్ధిదారులకు MLA చెక్కులు అందచేశారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు కంది శైలజ శ్రీకాంత్, రాసూరి సునీత, హేమ సామల, కంది నారాయణ రాజేశ్, పాకసాయి ఉన్నారు.