సంతనూతలపాడు: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సంతనూతలపాడు తహసిల్దార్ నారాయణరెడ్డి హెచ్చరించారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో ఆక్రమణకు గురైన 4 ఎకరాల 62 సెంట్లు ప్రభుత్వ భూమిని రెవెన్యూ సిబ్బందితో కలిసి తహసిల్దార్ నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణకు గురైన భూమి కొలతలు వేసి హద్దులను నిర్ణయించారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగిస్తామని తహసిల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.