ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మరి వేముల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రైతును రాజును చేసే పక్కా ప్రణాళిక రూపొందించింది అన్నారు. రైతుల కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి రైతులకు కరపత్రాలు అందజేశారు.