మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బిసి హాస్టల్ను ఎంపీడీవో జాన్ సుందరం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా హాస్టల్లో ఉన్న వసతి భోజన సదుపాయం మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వార్డెన్ కు సిబ్బందికి సూచించామన్నారు. విద్యార్థుల గతంలో హాస్టల్ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్ తనిఖీ చేయడం జరిగిందని ఎంపీడీవో అన్నారు.