మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వెలిసిన త్రిపురాంతకేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాలలో హుండీ లెక్కింపు చేసినట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి 14 లక్షల 24 వేల 32 రూపాయలు అమ్మవారికి 17 లక్షల 13,379 రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. అన్నదాన హుండీతో 18,531 రూపాయి మొత్తము 31,56,212 వచ్చినట్లు తెలిపారు.