కనిగిరి: మార్కాపురం జిల్లాలో అసాంఘిక కార్యకలా పనులు గుర్తించేందుకు స్కై ప్రాజెక్టు ద్వారా డ్రోన్ ఎగరవేసిన పోలీసులు
మార్కాపురం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు శుక్రవారం పోలీసులు స్కై ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉంటే ప్రాంతాలపై డ్రోన్ ఎగరవేసి పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే 100 keda 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యకలాపాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పట్టినట్లు అధికారులు చెప్పారు.