కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సూరా పాపిరెడ్డి నగర్ లో శ్రీ సీతారాముల ఆలయానికి వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీవో సంఘ నాయకులు రాంప్రసాద్, రాష్ట్ర దివ్యాంగుల హక్కుల అధ్యక్షులు ధూళిపాళ్ల మల్లికార్జున పాల్గొన్నారు.