నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శుక్రవారం ప్రారంభమైంది. ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30 రోజులపాటు మహిళలకు ఉచితంగా కటింగ్ మరియు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణకు అవసరమయ్యే మెటీరియల్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మహిళలు స్వస శక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.