అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో బస్సులను అడ్డుకున్న విద్యార్థులు, పాల్తూరు, హోన్నూరు, గోవిందవాడ, బల్లనగడ్డం తదితర గ్రామాలకు కాలేజీల సమయాల రాకపోకలకు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న సిఐ మహానంది ఆర్టీసీ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి విద్యార్థులకు సర్ది చెప్పి బస్సుల రాకపోకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.