హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటీవల అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నగదు జమ చేయడం జరిగిందని, ఇంకా నగదు జమకాని రైతులు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్, అధికారులు పాల్గొన్నారు.