శ్రీరంగాపూర్: వరి ధాన్య కొనుగోలు కేంద్రానికి సందర్శించిన అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు
శ్రీరంగాపురం మండల కేంద్రంలో పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరమైన టార్పాలిన్ కవర్లు పిపిసిల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నాణ్యమైన ధాన్యం అందించాల్సి ఉంటుందని అందువల్ల నిబంధనల ప్రకారం వరి ధాన్యం తేమ, తాలు, చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారు లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలి