ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలో సంగమేశ్వర డ్యామ్ నిర్మాణానికి 2009లో అప్పటి ఆర్థిక శాఖా మంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు శిలాఫలకం అలాగే ఉంది తప్ప పనులు ముందుకు సాగలేదు. టీడీపీ హయాంలో కొంతమేర నిర్మాణ పనులు సాగాయి. తర్వాత ఆగిపోయాయి. ఈ డ్యాం పూర్తయితే నాలుగు మండలాల్లో 20,000 ఎకరాలకు పైగా సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు వసతి కలుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.