ఏపీలో నెట్ మరియు ఐఐటి కోర్సులలో విద్యార్హత సాధించిన 57 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి, ఈసారి గురుకుల పాఠశాలలో 161 మంది జేఈఈకి విద్యార్హత సాధించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వారికి పై చదువులు చదివేందుకు వసతులు కల్పిస్తామని అన్నారు.