ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య పాఠశాలలో తౌషిక్ అనుమానస్పద మృతిపై త్రిసభ్య కమిటీ వేసి రోజులు గడుస్తున్నా సింగరాయకొండలో పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీలో జిల్లా ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, MRO రాజేశ్తో కలెక్టర్ ఈనెల 16న త్రిసభ్య కమిటీ నియమించారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శుక్రవారం కుటుంబ సభ్యులు అధికారులను నిలదీశారు.