అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ (పీ ఏ బీ ఆర్ ) సెంటర్ నాలుగో గేటును గురువారం డ్యామ్ ఇరిగేషన్ అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు డ్యాంలో నీటిమట్టం పెరుగుతుండటంతో భద్రత దృష్టితో నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ సుధాకర్ రావు పేర్కొన్నారు. రిజర్వాయర్లో 5.3 టీఎంసీ లకు గరిష్ట మట్టానికి చేరిందని భద్రత దృష్టిలో ఉంచుకుని 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ శశిరేఖ, డి ఈ వెంకటరమణ జేఈఈ ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.