కొండపి: పొన్నలూరు మండల కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు రూ.10వేల జరిమానా విధించిన ఎస్ఐ అనూక్
పొన్నలూరులో బుధవారం స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SI అనూక్ లైసెన్సులు లేని ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులకు 10వేల విలువ కలిగిన ఈ చలానాను విధించారు. అనంతరం మాట్లాడుతూ.. లైసెన్సులు, హెల్మెట్లు లేకుండా వాహనాలు నడపరాదన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించి ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు.