కనిగిరి పట్టణంలోని 14వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వైసిపి పోరాడుతుందన్నారు.