హిందూ దేవిదేవతలను అవమానించేటట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేవెళ్లలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ.. మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.