ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో గిద్దలూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. గాయపడ్డవారు దైవదర్శనం నిమిత్తం ఓంకారం వెళ్లి తిరిగి గిద్దలూరు కు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.