మార్కాపురం జిల్లా కంభం మండలానికి చెందిన వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. అధికారులు చెబుతున్న వివరాల మేరకు ఎరువుల దుకాణదారుడు నుంచి లంచం డిమాండ్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారని అదుపులకు తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.