మార్కాపురం జిల్లా కంభం మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ను శుక్రవారం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఎరువుల దుకాణ దారుడు వద్ద నుంచి రూ.20,000 వేలు లంచం తీసుకున్నట్టుగా అధికారులు అధికారులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం లైసెన్స్ విషయంలో తనను బెదిరించి లంచం అడిగినట్లుగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు లంచం తీసుకుంటుండగా మహమ్మద్ను పట్టుకున్నారు.