అడవి పందులతో ఆర్థికంగా నష్టపోయానని గిద్దలూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన కాశన్న అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. శుక్రవారం రైతు తెలిపిన వివరాల మేరకు తన మొక్కజొన్న పొలంలో పందులు చొరబడి పంటను నాశనం చేశాయని మళ్లీ తనపై దాడి చేయడంతో తనకు గాయాలైనట్లుగా వాపోయాడు. రూ.5 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లుగా రైతు తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.