మార్కాపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాచర్ల శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం లోతు ఎంతో నేటికీ తెలియని పరిస్థితి.. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి శనివారం భారీగా భక్తులు పోటెత్తుతారు. ఆలయగుండంలో స్నానమాచరించిన అనంతరం నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఆలయానికి శుద్ధిగా రాకపోతే ఆలయ సమీపంలో ఉన్న తేనెటీగలు కుట్టి తరిమేస్తాయట. ఓం మహర్షి వెయ్యి సంవత్సరాలపాటు తపస్సు చేసి ఈ ఆలయగుండం తవ్వినట్లుగా ఆలయ అర్చకులు రవికుమార్ తెలిపారు.