యాచారం మండలం కురుమిద్దలో 8 అడుగుల భారీ కొండచిలువ హడలెత్తించింది. దాన్ని చూసి భయభ్రాంతులకు గురైన అంజయ్య అనే గొర్రెల కాపరి స్థానికుల సహాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు 2 గంటల పాటు శ్రమించి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.