యర్రగొండపాలెం: దోర్నాల వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మీదేవిని పరామర్శించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఐనముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మీదేవి పాము కాటుకు గురయ్యారు. ఈ సందర్భంగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే చంద్రశేఖర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.