కొండాపూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ భూమి అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇందిరా గాంధీ ఇచ్చిందని స్థానికులు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమని ఖాళీ చేయించారని, ఇళ్లు కూల్చేశారని కొండాపూర్లో ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది.