కొండపి: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద 4.5 కిలోల గంజాయి స్వాధీనం: సీఐ హజరత్తయ్య
టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరు పరిధిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి స్థానికంగా ఉన్న యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు వారి నుంచి సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.