కనిగిరి: ఈనెల 21, 22 ,23 తేదీల్లో దర్శిలో జరుగు సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి: సిపిఐ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి యాసిన్
కనిగిరి: ఈనెల 21, 22 ,23 తేదీల్లో దర్శి పట్టణంలో జరుగు సిపిఐ పార్టీ ప్రకాశం జిల్లా మహాసభలను సిపిఐ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. కనిగిరి లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను పార్టీ నాయకులతో కలిసి మంగళవారం యాసిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మహాసభలలో పలు కీలక తీర్మానాలను చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలోని సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.