కనిగిరి: పారిశుద్ధ్య సమస్యల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పారిశుధ్యం పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు . కనిగిరి పట్టణంలోని రెండవ వార్డు శివనగర్ కాలనీలో ప్రజల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు చెత్తను తొలగించడం లేదని, పెద్ద ఎత్తున చెత్త నిలిచిపోవడంతో దుర్గంధంతో, దోమల వ్యాప్తి తో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్... ఎప్పటి చెత్తను అప్పుడే తొలగించాలని, లేకుంటే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.